Blog

  • పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

     PM KISAN: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్దిక చేయూత కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పుడు కూడా 8వ విడత నగదును రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్దం అవుతుంది.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    కేంద్ర ప్రభుత్వం ఈ మద్య కొంత మంది రైతులు అర్హత లేకున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని గుర్తించింది. ఈ సంఖ్య దాదాపు 33 లక్షల మంది అనర్హులుగా ఉన్నారని తేలింది. ఇక వీరికి మోదీ ఇస్తున్న రూ.6,000 ఇక రావు అన్నమాట. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, అనర్హులు అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.



    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?

    • 5 ఎకరాలలోపు గల చిన్న, ఉపాంత రైతులు
    • ప్రతి కచ్చితంగా పొలం పాస్ బుక్ ఉండాలి
    • లబ్ధిదారుడు భారతీయ పౌరుడిగా ఉండాలి.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అనర్హులు?

    • 5 ఎకరాల పైబడిన వారు ఈ పథకానికి అనర్హులు.
    • రాజ్యాంగ పదవిని నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వ్యక్తులు.
    • ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు లేదా అధికారులు.
    • స్థానిక ప్రభుత్వ సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత మరియు మాజీ మంత్రులు.
    • లోక్ సభ, రాజ్యసభ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.
    • రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.



    • జిల్లా పంచాయతీ ప్రస్తుత లేదా మాజీ చైర్‌పర్సన్.
    • ఏదైనా మునిసిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మరియు మాజీ మేయర్.
    • గత ఏడాది ఆధాయ పన్ను చెల్లించే వ్యక్తులు.
    • ప్రతి నెలా రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

    రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

     ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఇటీవలే తన రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మనదేశంలో మార్చి 18న జరిగింది. అమెజాన్, ఎంఐ.కాంలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లలో హైఎండ్ మోడల్ ఇదే. ఇందులో 108 ఎంపీ కెమెరా కూడా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.

    రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

    ఇక రియల్‌ మీx7 సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఫిబ్రవరి 4న విడుదల చేసింది. రియల్‌ మీ ఎక్స్‌ 7ప్రో, రియల్‌మీ ఎక్స్‌ 7 స్మార్ట్‌ ఫక్షన్‌లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌ సైట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ 7 5జీ సిరీస్‌ ఫోన్లలో సెల్ఫీ కెమెరా పంచ్‌ హూల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులో వస్తున్నాయి. రియల్ మీx7 5జీ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.



    రెండింటిలో ఏది కొనాలి?

    రెండు కూడా నెట్ ఫ్లిక్స్ వంటి వీడియొలు హెచ్ డిలో ప్లే అవుతాయి. దేనిలో డాల్బీ అట్మోస్ లేదు. డిస్ప్లే విషయనకి వస్తే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ కొంచెం మంచిగా ఉంది. ప్రాసెసర్ పరంగా చూస్తే స్నాప్ డ్రాగన్ 732జీ కంటే మీడియాటెక్‌ డైమెన్సిటీ 800 యూ మంచి పనితీరు కనబరుస్తుంది. స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో పోల్చిన డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ భాగా పనిచేస్తుంది. మీడియం గ్రాఫిక్స్ లో ఇది భాగా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఉష్ణోగ్రత 47 వరకు వెళ్తే, రియల్ మీx7 5జీలో 43 ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాసెసర్ విషయనికి వస్తే రియల్ మీx7 5జీ మంచిగా ఉంది.

    బ్యాటరీ రివ్యూ:

    ఇక బ్యాటరీ విషయానికి వస్తే రియల్ మీx7 5జీ 4310 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ చార్జర్(50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది. బ్యాటరీ లైఫ్ విషయంలో ‌నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఎక్కువ కాలం వస్తుంది. నోట్ 10ప్రో మ్యాక్స్ ను ఫుల్ చార్జ్ చేయడానికి గంటన్నర సమయం పడితే, రియల్ మీx7 5జీ నిమిషాల సమయం పడుతుంది.



    కెమెరా రివ్యూ:

    రెండు మొబైల్స్ లో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రియల్ మీx7 5జీలో వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో డెప్త్ సెన్సార్ ఉండదు. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ కెమెరా ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. రెండింటిలో మెయిన్ కెమెరాతో 30fpsలో 4కే వీడియొ, ఫ్రంట్ కెమెరా 30fpsతో 1080పీ వీడియొ, 120fpsతో 1080పీలో స్లో మోషన్ వీడియొ రికార్డు చేయవచ్చు.

    కెమెరా పనితీరు విషయానికి వస్తే డే లైట్ లో భాగానే పనిచేస్తున్నాయి. నైట్ లైట్ లో కూడా రెండు భాగానే పనిచేస్తున్నాయి. ఫ్లాష్ లో తీసినప్పుడు రియల్ మీx7లో కొంచెం మంచిగా పని చేస్తుంది. వైడ్ యాంగిల్ విషయంలో రెండు ఒకే విధంగా పనిచేస్తున్నాయి. మాక్రో కెమెరా విషయంలో నోట్ 10ప్రో మ్యాక్స్ భాగా పనిచేసింది. ఫ్రంట్ కెమెరా విషయంలో రియల్ మీx7 కొంచెం మంచి పని తీరు కనబరిచింది.

    రెండింటిలో అన్నీ సెన్సార్లు ఉన్నాయి. అన్నీ భాగానే పనిచేస్తున్నాయి. ఇక రియల్ మీx7 ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే, నోట్ 10ప్రో మ్యాక్స్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటే, రియల్ మీx7లో లేదు. రియల్ మీx7లో మైక్రో ఎస్డీ సపోర్ట్ లేదు, నోట్ 10ప్రో మ్యాక్స్ లో మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది. ఎక్కువ కాలం (2 నుంచి 4 సంవత్సరాలు) ఫోన్ వాడాలని అనుకుంటే 5జీ సపోర్ట్ ఉన్న రియల్ మీx7 తీసుకుంటే మంచిది. పెద్ద బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108 ఎంపీ కెమెరా కావాలి అనుకుంటే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

    పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

     PM-KISAN: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాలో మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను జమ చేస్తుంది. ఈ పథకంలో భాగంగా మొదటి విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడు విడతల నగదును జమ చేసింది. తాజాగా ఎనిమిదో విడత డబ్బులు ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. 

    పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

    పీఎం కిసాన్ పథకంలో చేరని వారు మార్చి 31లోగా నమోదు పేరును పీఎం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. లేకపోతే ఎనిమిదో విడత నగదు కూడా మీ ఖాతాలో జమకావు. ఇంతక ముందే మీ పేరు నమోదు చేసుకుంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌(pmkisan.gov.in)లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బెనిఫీసియరీ లిస్టులో(అర్హుల జాబితా) పేరున్న వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి.




    అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:
    • మొదట మీరు Home (pmkisan.gov.in) పోర్టల్ కు వెళ్లాలి.
    • ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
    • తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల | హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్

    ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల | హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్

     హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్ ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ టూ వీలర్ ఈజీ ప్లస్ ను లాంఛ్ చేసింది. ‎తక్కువ వేగం, తక్కువ బరువు కలిగిన ఈ ఎలక్ట్రిక్ మోడల్ 20ఆంపియర్, 250వాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఈజీ ప్లస్ ను ఫుల్ చార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ను నాలుగు రంగుల్లో అందుబాటుల్లో ఉంది. దీని ధర రూ.41,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈజీ ప్లస్‌ను టోకెన్ ద్వారా రూ.1,999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ 25 కి.మీ.

    ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల | హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్

    ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, ట్యూబ్ లెస్ టైర్లు, డ్రమ్ బ్రేక్స్, పెడల్స్ వంటి లక్షణాలతో వస్తుంది. ఈజీ ప్లస్ 170 కిలోల వరకు బరువును మోయగలదు. 40,000 కిలోమీటర్ల వరకు చెల్లుబాటు అయ్యే ఈ స్కూటర్‌పై కంపెనీకి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీతో పాటు ఉచిత హెల్మెట్‌ను కూడా అందిస్తున్నారు.‎ డీటెల్ ఈజీ ప్లస్ ను ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలో భారతీయ రోడ్లకు సరిపడే విదంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.



    ప్రధానంగా టైర్-2, టైర్-3 సిటీ మార్కెట్లలో తన మార్కెట్ చాటుకోవాలని కంపెనీ యోచిస్తోంది. డీటెల్ ఎలక్ట్రిక్ వాహనం వాడటం వల్ల ఒక చెట్టును రక్షించినట్లే అని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనం తీసుకున్న కస్టమర్ పేరిట ఒక చెట్టు నాటడంతో పాటు జియోట్యాగ్ కూడా చేయనున్నట్లు పేర్కొంది.‎ ‎2017 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, వినియోగ గాడ్జెట్లతో మార్కెట్ లోకి ప్రవేశించడంతో పాటు డీటెల్ 2020 జనవరిలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించింది.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం | హీరో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX

    హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం | హీరో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX

    హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం | హీరో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX

     ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,640. దీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లగలదు. ఇందులో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది చూడటానికి అన్నిటికంటే పొడవుగా చాలా భిన్నంగా ఉంది. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా దీనిని తయారు చేశారు. స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంది.



    ఈ స్కూటర్లలో మోడల్‌ని బట్టీ ఒకసారి చార్జ్ చేస్తే 82 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల దాకా వెళ్తాయి. ఇందులో ప్రారంభ మోడల్ 82 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో నిక్స్ హెచ్ ఎక్స్ హై స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. అంటే ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. వెనక రైడర్‌కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్ హోల్డర్ ఉంది. దీనికి 1.536 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లపై హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే డౌన్ పేమెంట్ రూ.4999 ఉంది. వడ్డీ రేటు రూ.6.99గా నిర్ణయించింది కంపెనీ.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులకు షాకింగ్‌ న్యూస్‌

    మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులకు షాకింగ్‌ న్యూస్‌

     

    మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులకు షాకింగ్‌ న్యూస్‌

    మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? అయితే మీకో చేదు వార్తా‌. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ తన మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల విషయంలో ఇతర కంపెనీలతో పోలిస్తే వెనుకబడి పోవడం వల్ల తన మొబైల్ సామ్రాజ్యానికి స్వస్తి పలకడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.




    దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఇల్బో నివేదిక ప్రకారం.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విషయంలో జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్‌సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలం కాకపోవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే నిలిపివేయాలని ఎల్‌జీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో లాంచ్ కాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ లను ఎల్‌జీ నిలిపివేసింది. ఎల్ జీ పాపులర్ స్మార్ట్‌ఫోన్ రోలబుల్ డిస్‌ప్లే గల ఫోన్ల ఉత్పత్తిని గత నెలలో నిలిపివేసింది.



    ‘ది రోలబుల్’ గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్‌జీ తిరిగి సీఈఎస్‌ 2021లో ప్రదర్శించింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా చెందిన ప్రముఖ పత్రిక జనవరిలోనే తెలిపింది. గత ఐదు ఏళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు(రూ.32,856 కోట్లు) నష్ట పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించినట్లు బాంగ్ తెలిపారు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • రైతుకు మేలుచేసే పంటలు

    రైతుకు మేలుచేసే పంటలు

    అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల ఉత్ప త్తిలో భారత్ ఆగ్రస్థానంలో ఉంది . దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల హెక్టార్లకు పైగా రకరకాల సుగంధ ద్రవ్యాలు సాగులో ఉండగా ఏటా 80 లక్షల టన్నులకు పైగా దిగుబడి నమోద వుతోంది . దేశం బహుళ వ్యవసాయిక వాతావ రణ మండళ్లకు నెలవు కావడం వల్ల రైతులు విభిన్న రకాల సుగంధ ద్రవ్యాలను , ఔషధ మూలి కలను సాగు చేయగలుగుతున్నారు .



     కొత్త ప్రాంతాలకు విస్తరణ :

     నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సరి కొత్త లాభదాయక పంటలసాగుకు రైతులు మొగ్గు చూపుతున్నందువల్ల సంప్రదాయకంగా సాగయ్యే ప్రాంతా ల్లోనే గాక సంప్రదాయేతర ప్రాంతా లకు కొత్త పంటలు విస్తరిస్తు న్నాయి . అయితే కొన్ని పంటలు సహ జంగానే సమృద్ధిగా పండే కీలక ప్రాంతాల్లో చీడపీడల బెడద పెనుసవాలుగా మారడం వల్ల పంటల అదనపు సంరక్షణ చర్య లపై అనాసక్తి ధోరణికి దారితీస్తోంది . ఒకప్పుడు గుజరాత్ , రాజస్తాన్ వంటి రాష్ట్రాల్లో విరివిగా సాగయ్యే జీలకర్ర , సోంపు , మెంతులు లాంటి విత్తన రకాలు నేడు తమిళనాడు , కర్ణాటక , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల వాతావరణంలోనూ సులభంగా సాగుచేయగలిగేలా రూపాంతరం చెందాయి . అలాగే కర్ణాటక , కేరళ రాష్ట్రాల పరిధిలోని పడమటి కనుమలు నల్లమిరియాల సాగుకు పెట్టింది పేరు . కాగా , ఇప్పుడు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ పండుతున్నాయి .

     అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ – ఒడిశా సరిహద్దులోని గిరిజనులు నివసించే కొండ ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ప్రధాన పంటగా మారుతోంది . కేరళ , దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో అల్లం విరి విగా సాగువుతుండం నేడు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు . అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా సాగుకు యోగ్యంగా మారింది . ఈ లక్షణాలను పసిగట్టిన ఆంధ్రప్రదేశ్ రైతులు విజయవంతంగా పండించడంతో పాటు పుదీనా నూనె ఉత్పత్తి కూడా ప్రారంభించారు .



     

    కొనుగోలు కేంద్రాల ఏర్పాటు :

     సుగంధ ద్రవ్యాల పంటలతో పాటు వాటితో వివిధ ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలు , కొనుగోలు కేంద్రాల వలస కూడా మొదలైంది . మొదట్లో గుజరాత్ , మహారాష్ట్ర , తదితర రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి , ‘ కేరళ మారుమూల ప్రాంతాల నుంచి సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసేవారు . ఇది గమనించిన స్థానిక వ్యాపారులు కూడా సుగంధ ద్రవ్యాల రూపాంతరీకరణ , ఉత్పత్తుల తయారీరంగంలోకి దిగారు . ఈ రంగం లో గల అపార అవ కాశాల జాడ పసిగ ట్టిన పారిశ్రామికవే తలు . దేశ వ్యాప్తంగా శుద్ధి , వివిధ ఉత్పత్తుల తయారీ కర్మాగారాలను భారీస్థాయిలో ఏర్పాటు చేశారు . తొలినాళ్లలో ప్రాధమి కంగా ముడి సుగంధ ద్రవ్యాలతోనే వ్యాపారం నడిచేది . కాబట్టి వాటి శుద్ధి సహా రవాణా కోసం గోతం సంచుల్లో నింపడం వంటి పను లను మానవ శ్రమతోనే చేసేవారు . అయితే సుగంధ ద్రవ్యాలను దిగుమతి చేసుకునే దేశాలు నాణ్యతపరంగా షరతులు విధించడం ప్రారంభించాయి . 

    దీంతో వ్యాపారులు సాధారణ యంత్రాలను ఏర్పాటుచేసి సుగంధ ద్రవ్యాలను శుద్ధి చేయడం మొద లు పెట్టారు . తదనంతర కాలంలో అమెరికా , ఐరోపా దేశాలు ప్రాథమిక నాణ్యత పైనే కరిన షరతులు పెట్టాయి . సుగంధ ద్రవ్యాలను అన్నివి ధాలా లోపరహితం చేయాలని , ముఖ్యంగా వాటినుంచి శిలీంద్ర విష కలు షితాలను తొలగించాలని డిమాండ్ చేశాయి . దీంతో వ్యాపారులు వైవిధ్య భరిత పద్ధతులవైపు మళ్లక తప్పలేదు . సుగంధ పార్కుల ర్పాటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై చొరవ చూపిన ఫలితంగా 1990 దశకం చివరన సుగంధ ద్రవ్యాల దిగుబడి అనంతర శుద్ధి , ఉత్పత్తుల తయారీలోకి కార్పొరేట్ సంస్థలు ఆడుగు పెట్టాయి . కొత్త శుద్ధి మార్గాలతో పాటు కర్మాగా రాల్లో అత్యాధునిక యాంత్రిక శుద్ధి , ఉత్పత్తి ఉపకరణాలు ఏర్పాటయ్యాయి . ఆప్పటినుంచి సుగంధ ద్రవ్యాలకు విలువ జోడింపు ద్విగుణీకృతమైంది . పొడి , తడి సుగంధ ద్రవ్యాలను వాటి సహజ రూపంలోనే గాక ట్రైన్ ద్రావణంలో నిర్జలీకరణ , పొడి ఘనీభవన , చూర్ణం , నలగొట్టిన , పిండి , గొట్టాల్లో నింపిన రూపాల్లో వివిధ దేశాలకు ఎగుమతి చేశారు . 

    దేశంలో సుగంధ ద్రవ్యాలు పండే ప్రాంతాలకు సమీపంలో సుగంధ ద్రవ్యాల శుద్ధి , ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా సుగంధద్రవ్య పార్కులు ఏర్పాటయ్యాయి . ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు , తమిళనాడులోని శివగంగ , కేరళలోని పూత్తడి , మధ్యప్రదేశ్ లోని చింద్వారా , గుణ , రాజస్థాన్ లోని జోధ్ పూర్ , కోటలలో పార్కులు ఏర్పడ్డాయి . వీటితోపాటు నాణ్యత నిర్ధారణ కోసం కొచ్చి , గుంటూరు , చెన్నై , ముంబయి , దిల్లీ , కాండా ప్రాంతాల్లో ప్రయోగశాలలు ఏర్పాటయ్యాయి . ఎగుమతికి ఉద్దేశించిన సుగంధ ద్రవ్యాల నాణ్యతను రవా జాకు ముందే తనిఖీ చేయడం వీటి బాధ్యత . ఈ చర్యలన్నింటి ఫలితంగా గడిచిన ఐదేళ్ల కాలంలో సుగంధ ద్రవ్యాల ఎగు మతులు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి . తద్వారా రూపాయిపరంగా వార్షిక సగటు వృద్ధి రేటు విలువ 1 శాతంగా , డాలరు పరంగా 5 శాతంగా నమోదు కావడంతో ప్రపంచ సుగంధ ద్రవ్యాల విపణిలో బారత్ పోషిస్తున్న పాత్ర ప్రధానమైంది , తదనుగుణంగా 2017-18లో మొత్తం రూ . 17,929 కోట్ల విలువైన 10.28,060 టన్నుల సుగంధ ద్రవ్యాలు , సంబంధిత ఉత్పత్తులు ఎగు మతయ్యాయి . భారత్ నుంచి మిరియాలు , యాలకులు , మిరప , అల్లం , పసుపు , దనియాలు , జీలకర , మెంతులు , అల్లం , కరివేపాకు పొడి , పుదీనా ఉత్ప త్తులు , సుగంధ నూనెలు వగైరా సుగంధ ద్రవ్యాల ఎగుమతి జరుగుతోంది . 2016 లో 1.05 లక్షల హెక్టార్లలో మిరియాలు సాగై ( నల్ల , తెల్ల మిరియాలు ) , 1.65 లట . ఉత్పత్తి లభించింది . మరోవైపు సింగపూర్ , అమెరికా , నెదర్లాండ్స్ , జర్మనీ , బ్రిటన్ దేశాలు తాము దిగుమతి చేసుకున్న సుగంధ ద్రవ్యాలను తమ అనుకుల భాగస్వామ్య దేశాలకు తిరిగి ఎగుమతి చేస్తున్నాయి .




     

    విస్తరణ లోపాలు :

     పరిశోధనలు , ప్రయోగశాలల ఫలితాలు పొలాలకు విస్తరించడంలో కొన్ని లోపాలున్నాయి . దీంతో పాటు రైతులకు సకాలంలో తగిన సాంకేతిక సల హాలు అందకపోవడం వల్ల వారు సంప్రదాయ పద్ధతులను అనుసరించక తప్పని పరిస్థితులు కొనసాగడం కూడా మరొక కారణంగా చెప్పవచ్చు . ఫలి తంగా చీడపీడల నివారణ కోసం వారు అనుసరించే పద్ధతుల్లోని లోపాలు దిగుబడి , నాణ్యత దిగజా గేందుకు దారితీయవచ్చు . అలాగే రైతుల ప్రమే యంతో నిమిత్తం లేని పంట అనంతర పరిస్థితులు , శుద్ధి , నిల్వ మార్కెట్ స్థాయి కూడా నాణ్యత క్షీణతకు కారణమవుతున్న మరికొన్ని అంశాలు . ఏది ఏమైనా భారత సుగంధ ద్రవ్యాలకు తిరస్కరణ ఎదురుకావడానికి శిలీంద్ర నాశకాలు , సాల్మొనెల్లా బ్యాక్టీరియా ప్రధాన కారణాలన్నది స్పష్టమవుతోంది .

     అమెరికా ఆహార , ఔషధ నియంత్రణ సంస్థ విడుడల చేసిన నివేదిక ప్రకారం … వారు పరీక్షించిన 20 వేల ఆహార పదార్థాల ఎగుమతులకుగాను దాదాపు 7 శాతంలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది . ఇందులో భారత్ నుంచి వెళ్లిన సరుకులో 9 శాతం ఈ బ్యాక్టీరియా ఉనికి ఉన్నట్లు వెల్ల డైంది . సుగంధ ద్రవ్యాలు , మూలికల ఎగుమతులపైనా ఐరోపా సమాఖ్య పంపే తక్షణ హెచ్చరికలను భారత సుగంధ ద్రవ్యాల జోర్డు పర్యవేక్షిస్తోంది . అప్లోటాక్సిన్స్ , పురుగుమందుల అవశేషాలు , సాల్మొనెల్లా ఉనికికి సంబంధించి ఐరోపా సమాఖ్య ప్రధానంగా తక్షణ హెచ్చరికలు జారీ చేస్తుంటుంది . సమాఖ్య ప్రమాణాల ప్రకారం అప్లోటాక్సిన్ల ఉనికి గరిష్టంగా 10 పీపీబీ ( పార్ట్స్ పర్ బిలియన్ ) ఉండాలి . 

    అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రమాణాల ప్రకారం ఇది 30 పీపీబీగా ఉంటుంది . కాగా , భారత్ నుంచి ఎగుమతయ్యే కరివే పాకు విషయంలో తగిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రం లేకపోవడం వల్ల కూడా ఐరోపా సమాఖ్య నుంచి తక్షణ హెచ్చరికలు వస్తున్నాయని సమాచారం . సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేసే మలేషియా , మెక్సికో , చైనా , ఈజిప్ట్ , ఇండోనేషియా , బ్రెజిల్ వంటి దేశాలు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొం టున్నాయి . ఈ నేపద్యంలో సుగంధ ద్రవ్యాలకుగల అంతర్జాతీయ గిరాకీ దృష్ట్యా నాణ్యతను మెరుగుపరిస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆమోదం లభిస్తుంది . తిరస్కరణకు దారితీస్తున్న ప్రధాన కారణాల్లో అత్యధికం సాగుదశలోనివే కాగా , మరికొన్ని శుద్ధికి సంబంధించినవి . కాబట్టి సాగు దశనుంచే పరిశ్రమ వర్గాలు ఈ సమస్యల పై నిశితంగా దృష్టి సారించాలి .