Tag: Tech News In Telugu

  • Driving License ఆన్లైన్ లో అప్లై చేయడం ఎలా..!

    Driving License ఆన్లైన్ లో అప్లై చేయడం ఎలా..!

     

    భారతదేశంలోని ప్రతి ఒక్కరూ ఏదైనా వాహనం నడపాలంటే డ్రైవింగ్ పర్మిట్ తప్పనిసరి. కాబట్టి.. ఇది చట్టబద్ధంగా వీధుల్లో వాహనం నడపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
    ఏదైనా సందర్భంలో, చాలా మంది వ్యక్తులు ఈ డ్రైవింగ్ పర్మిట్ పొందాలా వద్దా అని ఆలోచిస్తుంటారు. డ్రైవింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకునే విధానం తెలియక వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మీరు కొన్ని సూటిగా అడ్వాన్స్‌లను అనుసరించే సందర్భంలో, మీరు మీ ఇంటిని వదిలి వెళ్లకుండానే లెర్నింగ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.




    మీ ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే విద్యార్థి డ్రైవింగ్ పర్మిట్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ మేము క్లియర్ చేస్తాము. మీరు వెబ్‌లో విద్యార్థి పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకున్నా, మీ అనుమతిని పొందడానికి మీరు ఏ సందర్భంలోనైనా డిస్‌కనెక్ట్ చేయవలసి ఉంటుందని గమనించండి. అదనంగా, ఎక్కడో 18 సంవత్సరాలు నిండి ఉండటం మరియు ట్రాఫిక్ నియమాలు మరియు మార్గదర్శకాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ వయస్సు మరియు వివిధ అవసరాలను అందించడానికి మీరు కూడా గణనీయమైన నివేదికలను కలిగి ఉండాలి.

    భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అత్యంత ప్రభావవంతమైన పద్ధతి:






    * ముందుగా పబ్లిక్ అథారిటీ యొక్క అథారిటీ సైట్‌కి వెళ్లండి (https://parivahan.gov.in/parivahan/).
    * సైట్‌ను తెరిచిన తర్వాత, వెబ్ ఆధారిత పరిపాలనా ప్రాంతాన్ని తెరిచి, డ్రైవింగ్ పర్మిట్ సంబంధిత పరిపాలనలను ఎంచుకోండి.
    * ఆ తర్వాత మీకు ఏ రాష్ట్రంలో చోటు ఉందో ఎంచుకోవాలి.
    * ప్రస్తుతం ఎంపిక లెర్నర్ లైసెన్స్ అప్లికేషన్‌ను ఎంచుకోండి. * ఆ తర్వాత అక్కడ సూచించిన ప్రతి నియమాలను పూర్తిగా చదివి, మీ స్వంత సూక్ష్మబేధాలను నమోదు చేయండి.
    * ఆ తర్వాత మీ ఆధార్ మరియు బహుముఖ సంఖ్యలను నమోదు చేయండి.
    * విద్యార్థి అనుమతి దరఖాస్తు నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత, ఆశించిన రికార్డులను బదిలీ చేయండి.
    * చివరిగా మీరు మీ డ్రైవింగ్ పరీక్షకు వెళ్లాల్సిన తేదీని ఎంచుకుని, వాయిదాను పూర్తి చేయండి.
    * ఈ పరస్పర చర్య ముగిసే అవకాశం ఉంది.. ఇంటర్నెట్ ఆధారిత లెర్నింగ్ పర్మిట్ కోర్సు పూర్తయిందని హామీ ఇవ్వండి. వీటిని అనుసరించడం ద్వారా మీరు విద్యార్థుల అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి RTOకి వెళ్లవలసిన అవసరం లేదు. ఆశ్చర్యకరంగా, UPతో సహా అనేక రాష్ట్రాల్లో మీరు RTOని సందర్శించకుండానే విద్యార్థి అనుమతిని పొందవచ్చు మరియు ఆశ్చర్యకరంగా, వెబ్‌లో పరీక్షను పూర్తి చేయవచ్చు.

    అలాగే, మన ఆధార్ కార్డ్ పోయినప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డును ఎలా పొందాలో బిట్ బై బిట్ కోర్సులో చూద్దాం:


    ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసే ప్రక్రియ:





    * ముందుగా UIDAI అధికారిక సైట్‌ని తెరవండి. ఇంటర్‌ఫేస్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html) * UIDAI సైట్‌లోకి ప్రవేశించిన తర్వాత “నా ఆధార్” సెగ్మెంట్‌పై క్లిక్ చేయండి.
    * నా ఆధార్ విభాగంలో మీరు క్రింద కొన్ని ఎంపికలను చూస్తారు. వారు డౌన్‌లోడ్ ఆధార్ అనే ఎంపికను పొందుపరుస్తారు. దాన్ని ఎంచుకోండి.
    * ప్రస్తుతం మీరు ఆధార్ మరియు OTPతో లాగిన్‌ని వ్యక్తీకరించే బటన్‌ను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.
    * మీ ఆధార్ నంబర్‌ను కంపోజ్ చేస్తున్న నేపథ్యంలో, నమోదు చేయబడిన పోర్టబుల్ నంబర్‌పై వచ్చిన OTPని నమోదు చేయండి మరియు లాగిన్ బటన్‌ను స్నాప్ చేయండి.
    * సమర్థవంతమైన లాగిన్ తర్వాత మీ డౌన్‌లోడ్ ఆధార్ కార్డ్ ఎంపికపై క్లిక్ చేయండి మరియు మీ కార్డ్ తెరవబడుతుంది.
    * డౌన్‌లోడ్ ఆధార్ కార్డ్ అనే ఎంపిక ఉంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
    * ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలనుకుంటున్నది.. డౌన్‌లోడ్ చేసిన ఆధార్ రికార్డ్‌ను తెరవడానికి మీకు రహస్య కీ అభ్యర్థించబడుతుంది.
    * ఆ సీక్రెట్ కీ ఏంటంటే… మీరు మీ పేరులోని నాలుగు అక్షరాలను మరియు ప్రపంచ సంవత్సరానికి మీ పరిచయానికి సంబంధించిన అంకెలను టైప్ చేస్తే, రికార్డ్ ఓపెన్ అవుతుంది.
    ఉదాహరణకు.. మీరు AVINASH అని అనుకోవచ్చు, పుట్టిన సంవత్సరం 1990, రహస్య పదబంధం కనిపిస్తుంది.. పేరులోని మొదటి 4 అక్షరాలు.. ఇంకా, పొడిగించిన పుట్టిన సమయం యొక్క అంకెలు తప్పనిసరిగా కంపోజ్ చేయబడాలి. AVIN1990 వలె. ప్రస్తుతం మీరు మీ ఆధార్‌ను చూస్తారు.
    * ఎవరైనా తమ ఆధార్ కార్డును పోగొట్టుకున్నారని భావించి ఈ టెక్నిక్‌ని ఉపయోగించి.. మరొకసారి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

  • కేవలం 17 రూపాయిలతో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం

     దేశంలోని ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల సంఖ్య 40 శాతంపైగా పెరిగినట్లు ఒక నివేదిక పెరిగింది. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ వాహనా రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో అని. చాలా కంపెనీల ఎలక్ట్రిక్ వాహన కంపెనీల బైక్ లు, స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకం ధరను కొనుగోలుచేయడానికి ఆలోచిస్తున్నారు.



    చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే ఒక స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది‌. ఈ సంస్థకు చెందిన “ఇప్లూటో 7 జీ” అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కి.మీ వ‌ర‌కు ఆగకుండా ప్ర‌యాణం చేయోచ్చ‌ని సంస్థ పేర్కొంటుంది.

    మరో ముఖ్య విషయం ఏమిటంటే దీనిని ఫుల్ ఛార్జ్ చేయయడానికి అయ్యే ఖర్చు 17 రూపాయలు మాత్రమే అని ప్యూర్ ఈవీ పేర్కొంది. అంటే కేవ‌లం రూ.17తోనే సుమారు 116 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవచ్చు అన్నమాట‌. అలాగే, ఈ స్కూటర్ కేవ‌లం 5 సెక‌న్లలోనే దాదాపు 40 కిమీ స్పీడ్ ను అందుకుంటుంది. ఇప్లూటో 7జీ గరిష్ట వేగం 60 కిలోమీట‌ర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి 4గంట‌ల సమయం ప‌డుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఐదేళ్ల వారంటీతో పాటు వ‌చ్చే ఈ బైక్ తీసుకోవ‌డానికి ప‌లు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయి.

  • ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

    ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

     

    ఇంట్లో నుంచే క్షణాల్లో డిజిటల్ ఓటర్ ఐడి డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా

    దేశంలోని ఓటర్లందరికీ శుభవార్త. భారత ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్(ఈ-ఎపిక్) కార్డును అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న మన దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దీనిని ప్రారంభించారు. ఇప్పుడు మీ ఓటర్ ఐడీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డు అనేది సురక్షితమైన పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్(పీడీఎఫ్) వెర్షన్. దీనిలో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.



    మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో పీడీఎఫ్ ఫార్మాట్ లో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును మీరు మీ మొబైల్ లేదా డిజి లాకర్‌లో పిడిఎఫ్‌గా అప్‌లోడ్ చేయవచ్చు లేదా ప్రింట్ తీసుకొని భద్రంగా ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ఓటర్ ఐడీ చూపించి ఎన్నికల్లో ఓటు కూడా వేయొచ్చు. అంటే ఓటర్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మొదట కొత్త ఓటర్ కార్డు కోసం నవంబర్-డిసెంబర్ 2020 సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు 2021 జనవరి 25 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగతా సాధారణ ఓటర్లు అందరూ ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును Voter Portal: http://voterportal.eci.gov.in/ లేదా NVSP: https://nvsp.in/ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు కాకుండా సాదారణ ఓటర్లు అందరూ మొదట ఈ-కేవైసి పూర్తి చేసుకోవాలి.



    డిజిటల్ ఓటర్ ఐడి పూర్తి సమాచారం!

    మీకు ఓటర్ ఐడీ నెంబర్ తెలియకపోయినా ఈ-ఎపిక్ కార్డును http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ పోర్టల్స్‌లో మీ పేరు సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయొచ్చు. అలాగే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్ ఉపయోగించి ఈ-ఎపిక్ డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. e-EPIC డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించి ఓటు వేయవచ్చు. 

    http://voterportal.eci.gov.in/ లేదా https://nvsp.in/ లేదా Voter Helpline Mobile App ప్లాట్‌ఫామ్స్ ద్వారా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయాలి.



    మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే e-KYC పూర్తి చేయాలి. e-KYC అంటే మీ ఫోటో క్యాప్చర్ చేసి EPIC డేటాతో కంపేర్ చేస్తారు. ఒకవేల e-KYC ఫెయిల్ అయితే ఈఆర్‌ఓ ఆఫీసుకు వెళ్లి ఫోటో ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. మొబైల్ నెంబర్ అప్‌డేట్ లేకపోతే? e-KYC ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. e-KYC పూర్తైన తర్వాతే డౌన్‌లోడ్ చేయొచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించొచ్చు.

  • షియోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్లు

    షియోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్లు

     

    షియోమీ ఎంఐ 11 స్పెసిఫికేషన్లు

    ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 లైట్ సిరీస్ 5జీ స్మార్ట్ ఫోన్ లను మార్చి 29న గ్లోబల్ గా లాంచ్ చేసింది. గత ఏడాది డిసెంబర్ లో చైనాలో ఎంఐ 11 సిరీస్ లో మూడు కొత్త ఫోన్లను విడుదలచేసిన సంగతి తెలిసిందే. షియోమీ ఇంకా భారత్ లో ఎంఐ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఎప్పుడు తీసుకొస్తుంది అనేది స్పష్టం చేయలేదు.



    ఎంఐ 11 అల్ట్రా స్పెసిఫికేషన్లు:

    • 6.81-అంగుళాల 2కే ఈ4 అమోఎల్ఈడి డిస్ప్లే
    • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 240 టచ్ శాంపులింగ్ రేటు
    • 1.1-అంగుళాల అమోఎల్ఈడి సెకండరీ టచ్ డిస్ ప్లే
    • క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్, అడ్రినో 660 జీపీయూ
    • 5,000 ఎంఎహెచ్ బ్యాటరీ, 67వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్
    • 50 ఎంపీ శామ్ సంగ్ జీఎన్2 ప్రైమరీ వైడ్-యాంగిల్ (f/1.95)
    • 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్586 అల్ట్రా-వైడ్-యాంగిల్(f/2.2)
    • 48 మెగాపిక్సల్ టెలి-మాక్రో కెమెరా (f/2.2)
    • 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా(ఎఫ్/2.2 లెన్స్)
    • 08 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.66,400
    • 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.72,000
    • 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: రూ.77,500
  • రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

    రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

     ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఇటీవలే తన రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ సేల్ మనదేశంలో మార్చి 18న జరిగింది. అమెజాన్, ఎంఐ.కాంలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ నోట్ 10 సిరీస్ ఫోన్లలో హైఎండ్ మోడల్ ఇదే. ఇందులో 108 ఎంపీ కెమెరా కూడా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.

    రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ VS రియల్ మీx7 5జీ రెండింటిలో ఏది కొనాలి?

    ఇక రియల్‌ మీx7 సిరీస్‌లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఫిబ్రవరి 4న విడుదల చేసింది. రియల్‌ మీ ఎక్స్‌ 7ప్రో, రియల్‌మీ ఎక్స్‌ 7 స్మార్ట్‌ ఫక్షన్‌లను భారత్‌లో లాంచ్‌ చేసింది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌, రియల్‌మీ వెబ్‌ సైట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఎక్స్‌ 7 5జీ సిరీస్‌ ఫోన్లలో సెల్ఫీ కెమెరా పంచ్‌ హూల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులో వస్తున్నాయి. రియల్ మీx7 5జీ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది.



    రెండింటిలో ఏది కొనాలి?

    రెండు కూడా నెట్ ఫ్లిక్స్ వంటి వీడియొలు హెచ్ డిలో ప్లే అవుతాయి. దేనిలో డాల్బీ అట్మోస్ లేదు. డిస్ప్లే విషయనకి వస్తే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ కొంచెం మంచిగా ఉంది. ప్రాసెసర్ పరంగా చూస్తే స్నాప్ డ్రాగన్ 732జీ కంటే మీడియాటెక్‌ డైమెన్సిటీ 800 యూ మంచి పనితీరు కనబరుస్తుంది. స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో పోల్చిన డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్ భాగా పనిచేస్తుంది. మీడియం గ్రాఫిక్స్ లో ఇది భాగా పనిచేస్తుంది. గేమ్స్ ఆడేటప్పుడు రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఉష్ణోగ్రత 47 వరకు వెళ్తే, రియల్ మీx7 5జీలో 43 ఉష్ణోగ్రత నమోదైంది. ప్రాసెసర్ విషయనికి వస్తే రియల్ మీx7 5జీ మంచిగా ఉంది.

    బ్యాటరీ రివ్యూ:

    ఇక బ్యాటరీ విషయానికి వస్తే రియల్ మీx7 5జీ 4310 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 65 వాట్ ఫాస్ట్ చార్జర్(50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 5020 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ చార్జర్ ఉంది. బ్యాటరీ లైఫ్ విషయంలో ‌నోట్ 10ప్రో మ్యాక్స్ లో ఎక్కువ కాలం వస్తుంది. నోట్ 10ప్రో మ్యాక్స్ ను ఫుల్ చార్జ్ చేయడానికి గంటన్నర సమయం పడితే, రియల్ మీx7 5జీ నిమిషాల సమయం పడుతుంది.



    కెమెరా రివ్యూ:

    రెండు మొబైల్స్ లో 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. రియల్ మీx7 5జీలో వెనుక వైపు మూడు కెమెరాలు ఉంటాయి. ఇందులో డెప్త్ సెన్సార్ ఉండదు. 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో సెన్సార్ కెమెరా ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. రెండింటిలో మెయిన్ కెమెరాతో 30fpsలో 4కే వీడియొ, ఫ్రంట్ కెమెరా 30fpsతో 1080పీ వీడియొ, 120fpsతో 1080పీలో స్లో మోషన్ వీడియొ రికార్డు చేయవచ్చు.

    కెమెరా పనితీరు విషయానికి వస్తే డే లైట్ లో భాగానే పనిచేస్తున్నాయి. నైట్ లైట్ లో కూడా రెండు భాగానే పనిచేస్తున్నాయి. ఫ్లాష్ లో తీసినప్పుడు రియల్ మీx7లో కొంచెం మంచిగా పని చేస్తుంది. వైడ్ యాంగిల్ విషయంలో రెండు ఒకే విధంగా పనిచేస్తున్నాయి. మాక్రో కెమెరా విషయంలో నోట్ 10ప్రో మ్యాక్స్ భాగా పనిచేసింది. ఫ్రంట్ కెమెరా విషయంలో రియల్ మీx7 కొంచెం మంచి పని తీరు కనబరిచింది.

    రెండింటిలో అన్నీ సెన్సార్లు ఉన్నాయి. అన్నీ భాగానే పనిచేస్తున్నాయి. ఇక రియల్ మీx7 ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటే, నోట్ 10ప్రో మ్యాక్స్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. నోట్ 10ప్రో మ్యాక్స్ లో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంటే, రియల్ మీx7లో లేదు. రియల్ మీx7లో మైక్రో ఎస్డీ సపోర్ట్ లేదు, నోట్ 10ప్రో మ్యాక్స్ లో మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ ఉంది. ఎక్కువ కాలం (2 నుంచి 4 సంవత్సరాలు) ఫోన్ వాడాలని అనుకుంటే 5జీ సపోర్ట్ ఉన్న రియల్ మీx7 తీసుకుంటే మంచిది. పెద్ద బ్యాటరీ, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108 ఎంపీ కెమెరా కావాలి అనుకుంటే రెడ్ మీ నోట్ 10ప్రో మ్యాక్స్ తీసుకోవచ్చు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల | హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్

    ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల | హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్

     హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్ ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ టూ వీలర్ ఈజీ ప్లస్ ను లాంఛ్ చేసింది. ‎తక్కువ వేగం, తక్కువ బరువు కలిగిన ఈ ఎలక్ట్రిక్ మోడల్ 20ఆంపియర్, 250వాట్ లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఈజీ ప్లస్ ను ఫుల్ చార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ను నాలుగు రంగుల్లో అందుబాటుల్లో ఉంది. దీని ధర రూ.41,999 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈజీ ప్లస్‌ను టోకెన్ ద్వారా రూ.1,999 చెల్లించి అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ 25 కి.మీ.

    ప్రపంచంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్‌ బైక్‌ విడుదల | హోమ్ గ్రోన్ ఎలక్ట్రిక్ స్టార్టప్ డీటెల్

    ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ పానెల్, ట్యూబ్ లెస్ టైర్లు, డ్రమ్ బ్రేక్స్, పెడల్స్ వంటి లక్షణాలతో వస్తుంది. ఈజీ ప్లస్ 170 కిలోల వరకు బరువును మోయగలదు. 40,000 కిలోమీటర్ల వరకు చెల్లుబాటు అయ్యే ఈ స్కూటర్‌పై కంపెనీకి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీతో పాటు ఉచిత హెల్మెట్‌ను కూడా అందిస్తున్నారు.‎ డీటెల్ ఈజీ ప్లస్ ను ప్రపంచంలోనే అత్యంత చౌక ధరలో భారతీయ రోడ్లకు సరిపడే విదంగా రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.



    ప్రధానంగా టైర్-2, టైర్-3 సిటీ మార్కెట్లలో తన మార్కెట్ చాటుకోవాలని కంపెనీ యోచిస్తోంది. డీటెల్ ఎలక్ట్రిక్ వాహనం వాడటం వల్ల ఒక చెట్టును రక్షించినట్లే అని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ వాహనం తీసుకున్న కస్టమర్ పేరిట ఒక చెట్టు నాటడంతో పాటు జియోట్యాగ్ కూడా చేయనున్నట్లు పేర్కొంది.‎ ‎2017 నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, వినియోగ గాడ్జెట్లతో మార్కెట్ లోకి ప్రవేశించడంతో పాటు డీటెల్ 2020 జనవరిలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి ప్రవేశించింది.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం | హీరో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX

    హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం | హీరో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX

    హీరో ఎలక్ట్రిక్ సంచలనం: సింగిల్ చార్జ్ తో 200 కి.మీ ప్రయాణం | హీరో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX

     ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఈ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు నిక్స్ హెచ్ ఎక్స్. దీని ప్రారంభ ధర రూ.64,640. దీని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వెళ్లగలదు. ఇందులో ఆప్టిమా HX, నిక్స్ HX, ఫోటాన్ HX అనే మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది చూడటానికి అన్నిటికంటే పొడవుగా చాలా భిన్నంగా ఉంది. సామాన్యులు, గ్రామీణ ప్రజలకు తగ్గట్టుగా దీనిని తయారు చేశారు. స్పీడ్, రేంజ్ బట్టి స్కూటర్ ఎంచుకునే అవకాశం ఉంది.



    ఈ స్కూటర్లలో మోడల్‌ని బట్టీ ఒకసారి చార్జ్ చేస్తే 82 కిలోమీటర్ల నుంచి 210 కిలోమీటర్ల దాకా వెళ్తాయి. ఇందులో ప్రారంభ మోడల్ 82 కిలోమీటర్లు వెళ్తుంది. టాప్ మోడల్ 210 కిలోమీటర్లు వెళ్లనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో నిక్స్ హెచ్ ఎక్స్ హై స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు. అంటే ఇది సిటీలో ప్రయాణించేవారికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో డిజిటల్ స్పీడోమీటర్ ఉంది. వెనక రైడర్‌కి మూడు గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి. ఓ బాటిల్ హోల్డర్ ఉంది. దీనికి 1.536 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లపై హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తుంది. ఎవరైనా హీరో బైక్ లేదా స్కూటర్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో పొందాలనుకుంటే డౌన్ పేమెంట్ రూ.4999 ఉంది. వడ్డీ రేటు రూ.6.99గా నిర్ణయించింది కంపెనీ.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులకు షాకింగ్‌ న్యూస్‌

    మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులకు షాకింగ్‌ న్యూస్‌

     

    మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులకు షాకింగ్‌ న్యూస్‌

    మీరు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్‌ ప్రీయులా? అయితే మీకో చేదు వార్తా‌. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ తన మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్ని పూర్తిగా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల విషయంలో ఇతర కంపెనీలతో పోలిస్తే వెనుకబడి పోవడం వల్ల తన మొబైల్ సామ్రాజ్యానికి స్వస్తి పలకడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.




    దక్షిణ కొరియాకు చెందిన డోంగా ఇల్బో నివేదిక ప్రకారం.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాల విషయంలో జర్మనీకి చెందిన వోక్స్‌వ్యాగన్ ఏజీ, వియత్నాంకు చెందిన వింగ్రూప్ జేఎస్‌సి అనే రెండు సంస్థలతో ఎల్జీ చర్చలు జరిపింది. ఈ చర్చలు సఫలం కాకపోవడంతో మొత్తం మొబైల్ కమ్యూనికేషన్ వ్యాపారాన్నే నిలిపివేయాలని ఎల్‌జీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో లాంచ్ కాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ లను ఎల్‌జీ నిలిపివేసింది. ఎల్ జీ పాపులర్ స్మార్ట్‌ఫోన్ రోలబుల్ డిస్‌ప్లే గల ఫోన్ల ఉత్పత్తిని గత నెలలో నిలిపివేసింది.



    ‘ది రోలబుల్’ గా పిలువబడే ఈ ఫోన్‌ను ఎల్‌జీ తిరిగి సీఈఎస్‌ 2021లో ప్రదర్శించింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు నిలిపివేసి, ఆ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే వైపు ఆలోచన చేస్తోందని కొరియా చెందిన ప్రముఖ పత్రిక జనవరిలోనే తెలిపింది. గత ఐదు ఏళ్లలో కంపెనీ 4.5 బిలియన్ల డాలర్లు(రూ.32,856 కోట్లు) నష్ట పోయినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే మొబైల్ కమ్యూనికేషన్స్‌ని విడిచిపెట్టాలని నిర్ణయించినట్లు బాంగ్ తెలిపారు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు