Tag: pm kisan samman nidhi

  • పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

     PM KISAN: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్దిక చేయూత కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పుడు కూడా 8వ విడత నగదును రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్దం అవుతుంది.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు?

    కేంద్ర ప్రభుత్వం ఈ మద్య కొంత మంది రైతులు అర్హత లేకున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని గుర్తించింది. ఈ సంఖ్య దాదాపు 33 లక్షల మంది అనర్హులుగా ఉన్నారని తేలింది. ఇక వీరికి మోదీ ఇస్తున్న రూ.6,000 ఇక రావు అన్నమాట. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, అనర్హులు అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.



    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?

    • 5 ఎకరాలలోపు గల చిన్న, ఉపాంత రైతులు
    • ప్రతి కచ్చితంగా పొలం పాస్ బుక్ ఉండాలి
    • లబ్ధిదారుడు భారతీయ పౌరుడిగా ఉండాలి.

    పీఎం కిసాన్ పథకానికి ఎవరు అనర్హులు?

    • 5 ఎకరాల పైబడిన వారు ఈ పథకానికి అనర్హులు.
    • రాజ్యాంగ పదవిని నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వ్యక్తులు.
    • ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు లేదా అధికారులు.
    • స్థానిక ప్రభుత్వ సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.
    • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత మరియు మాజీ మంత్రులు.
    • లోక్ సభ, రాజ్యసభ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.
    • రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.



    • జిల్లా పంచాయతీ ప్రస్తుత లేదా మాజీ చైర్‌పర్సన్.
    • ఏదైనా మునిసిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మరియు మాజీ మేయర్.
    • గత ఏడాది ఆధాయ పన్ను చెల్లించే వ్యక్తులు.
    • ప్రతి నెలా రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు

  • పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

    పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

     PM-KISAN: కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో తీసుకువచ్చింది. అప్పటి నుంచి అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాలో మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలను జమ చేస్తుంది. ఈ పథకంలో భాగంగా మొదటి విడత డబ్బులను ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో విడత ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు, మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు కేంద్రం రైతుల ఖాతాల్లో ఏడు విడతల నగదును జమ చేసింది. తాజాగా ఎనిమిదో విడత డబ్బులు ఏప్రిల్ నుంచి జమ చేయనున్నారు. 

    పీఎం కిసాన్ రైతుల అర్హుల జాబితాలో మీ పేరు ఉందా? అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా

    పీఎం కిసాన్ పథకంలో చేరని వారు మార్చి 31లోగా నమోదు పేరును పీఎం కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. లేకపోతే ఎనిమిదో విడత నగదు కూడా మీ ఖాతాలో జమకావు. ఇంతక ముందే మీ పేరు నమోదు చేసుకుంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌(pmkisan.gov.in)లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బెనిఫీసియరీ లిస్టులో(అర్హుల జాబితా) పేరున్న వారికి మాత్రమే ఈ పథకం కింద డబ్బులు వస్తాయి.




    అర్హుల జాబితాలో మీ పేరు తనిఖీ చేసుకోండి ఇలా:
    • మొదట మీరు Home (pmkisan.gov.in) పోర్టల్ కు వెళ్లాలి.
    • ఇప్పుడు మీకు ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ లో కనిపించే Beneficiaries Listపై క్లిక్ చేయాలి.
    • తర్వాత రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాల ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.

    మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు