Tag: News in Telugu

  • Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తన కొడుకుని చూసి మురిసిపోతున్న.. ఎమోషనల్ పోస్ట్

    Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తన కొడుకుని చూసి మురిసిపోతున్న.. ఎమోషనల్ పోస్ట్

     


    Kajal Aggarwal : టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఈ సంవత్సరం జూన్ 19న మగ బిడ్డను జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాజల్ తన కొడుకు పేరు నీల్‌ కిచ్లూ అని నామకరణం చేశారు. ప్రస్తుతం తన విలువైన సమయాన్ని కొడుకు కోసమే గడుపుతున్నారు. తల్లిగా తను పొందే సంతోషాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. కొడుకు పుట్టి ఆరు నెలలు గడుస్తున్నా సందర్భంగా కాజల్ అగర్వాల్ గారు తన కొడుకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాబూ ఫొటోలో తల పైన చేయి పెట్టుకొని చిరునవ్వుతో చాలా ముద్దుగా ఉన్నాడు. బుడ్డోడు




    కాజల్ అగర్వాల్ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ నీల్‌ కిచ్లూ నువ్వు నా జీవితంలో వచ్చి అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. నేను యవ్వనంలో ఉన్నప్పుడు. ఒక తల్లిగా న బాధ్యత సరిగ్గా నెరవేరుస్తానో లేదో అన్నా అనుమానం, భయాందోళన నాలో ఉండేది. నేను ఇప్పటికీ గొప్ప తల్లిగా ఎలా ఉండాలో నేర్చుకుంటూనే ఉన్న.




    రాత్రిపూట రోజు నువ్ అటూ ఇటూ దొర్లడం, నేలపైన పాకడం ని అల్లరి చూసి నేను ఎంతో మురిసిపోతూ ఉన్నాను. ర న చిట్టి కన్నా ని జీవితంలో జరిగే స్వీట్ మెమోరీస్ నేను ఎప్పుడు మర్చిపోలేను. రా న చిన్ని తండ్రి
    నేను మీ నాన్న ని జ్ఞాపకాలను, అల్లరి చూసి మాట్లాడుతూ నవ్వుకుంటున్నాం. నీకు జన్మనిచే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నువు పుట్టి సంవత్సరం అవడానికి ఇంకా సగం దూరం మాత్రమే ఉంది. మై లవ్ మై బేబీ నీల్’.. అంటూ కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.
  • ChinmayiSriPaada : ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియా లో వైరల్

    ChinmayiSriPaada : ఒకేసారి ఇద్దరు పిల్లలకు పాలిస్తున్న చిన్మయి.. సోషల్ మీడియా లో వైరల్

    ChinmayiSriPaada
    ChinmayiSriPaada : సినీ పరిశ్రమలో సింగర్ చిన్మయిని తెలియని వారు ఎవరు ఉండరు. ఒక అమ్మాయి కష్టాల్లో ఉందని తెలిస్తే, ఆమె తరపున సహాయం చేయడానికి చిన్మయి ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారికి పూర్తిగా తెలుసు. కొన్ని రోజుల క్రితం నటుడు, దర్శకుడు రాహుల్‌ గారిని ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని నెలల కిందటే ఇద్దరి కవలలకు జన్మనిచ్చినట్లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ప్రజలకు తెలిపారు. పోస్ట్ పెట్టినప్పటి నుంచి విమర్శలు ఎక్కువ అయ్యాయి.




    ChinmayiSriPaada Marriage
    మరోవైపు హీరోయిన్ నయనతారలాగే చిన్మయి కూడా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ వార్తలపై చిన్మయి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. గర్భవతిగా ఉన్నప్పుడు తీసిన సెల్ఫీ ఫోటోను పోస్ట్ చేస్తూ.. గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకున్న తొలి సెల్ఫీ అని తెలిపింది. చిన్మయికి సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఛానెల్ దానికి సంబంధించిన సమస్యలు మరియు సమస్యలపై అవగాహన కల్పిస్తుంది.




    తాజాగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఇద్దరు చిన్నారుల హస్తం కనిపించింది. ఇద్దరి పిల్లలకు ఒకేసారి పాలు ఇవ్వడం విశేషం. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి ఫొటోలను అసలు పోస్ట్ చేయరు. కానీ చిన్మయి పోస్ట్ చేసింది. ఇలాంటి ఫోటోలను పోస్ట్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • కేవలం 17 రూపాయిలతో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం

     దేశంలోని ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై రోజురోజుకి ఆసక్తి పెరుగుతుంది. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ల సంఖ్య 40 శాతంపైగా పెరిగినట్లు ఒక నివేదిక పెరిగింది. దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు ఎలక్ట్రిక్ వాహనా రంగం ఎంత వేగంగా విస్తరిస్తుందో అని. చాలా కంపెనీల ఎలక్ట్రిక్ వాహన కంపెనీల బైక్ లు, స్కూటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్య ప్రజానీకం ధరను కొనుగోలుచేయడానికి ఆలోచిస్తున్నారు.



    చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు స్పీడ్ తక్కువగా వెళ్లడం లేదా ధర ఎక్కువగా ఉండటం చేత సామాన్య ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ సమస్యలు అన్నీ దృష్టిలో పెట్టుకొని సామాన్యుల‌కు అందుబాటులో ఉండేలా ఎల‌క్ట్రిక్ స్కూటర్లను హైదరాబాద్ కు చెందిన ప్యూర్ ఈవీ అనే ఒక స్టార్టప్ సంస్థ తయారు చేస్తుంది‌. ఈ సంస్థకు చెందిన “ఇప్లూటో 7 జీ” అనే హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 116 కి.మీ వ‌ర‌కు ఆగకుండా ప్ర‌యాణం చేయోచ్చ‌ని సంస్థ పేర్కొంటుంది.

    మరో ముఖ్య విషయం ఏమిటంటే దీనిని ఫుల్ ఛార్జ్ చేయయడానికి అయ్యే ఖర్చు 17 రూపాయలు మాత్రమే అని ప్యూర్ ఈవీ పేర్కొంది. అంటే కేవ‌లం రూ.17తోనే సుమారు 116 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవచ్చు అన్నమాట‌. అలాగే, ఈ స్కూటర్ కేవ‌లం 5 సెక‌న్లలోనే దాదాపు 40 కిమీ స్పీడ్ ను అందుకుంటుంది. ఇప్లూటో 7జీ గరిష్ట వేగం 60 కిలోమీట‌ర్లు. ఇది 2.5 కేడ్ల్యూహెచ్ లిథియోమ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. దీనిని ఫుల్ చార్జ్ చేయ‌డానికి 4గంట‌ల సమయం ప‌డుతుంది. ఇప్లూటో 7 జీ ఎక్స్ షోరూమ్ ధర రూ.83,999 గా కంపెనీ నిర్ణ‌యించింది. ఐదేళ్ల వారంటీతో పాటు వ‌చ్చే ఈ బైక్ తీసుకోవ‌డానికి ప‌లు బ్యాంక్ లు లోన్ కూడా అందిస్తున్నాయి.

  • మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    మరోసారి గొప్ప మనసు చాటిన ఆనంద్ మహీంద్రా

    కష్టాల్లో ఉన్నవారి పట్ల ఉదారత చూపే అతికొద్ది వ్యాపారవేత్తల్లో ఆనంద్‌ మహీంద్రా ఒకరు. గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన 80 ఏళ్ల వయసులో రూపాయికే ఇడ్లీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న ‘ఇడ్లీ బామ్మ’ కమలాత్తాళ్ కు ఆనంద్‌ మహీంద్రా అండగా నిలిచారు. త్వరలోనే ఆమె సొంత ఇంటి కల నెరవేరనున్నట్లు మహీంద్రా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కోయంబత్తూరుకు చెందిన కమలాతాల్ 2019లో కేవలం 1రూపాయకే ఇడ్లీలు వండి అమ్మడంతో ‘ఇడ్లీ బామ్మ’గా వైరల్ అయింది.



    30 ఏళ్లుగా ఆమె తన వ్యాపారాన్ని కట్టేల పొయ్యి మీద చిన్న ఇంట్లో నుంచే నడుపుతోంది. అయితే, ఆమె లాభాల కోసం కాకుండా రోజుకు వెయ్యి ఇడ్లీల వరకు అమ్ముతూ నిరుపేద జీవితాలకు తనవంతు సాయం చేస్తున్నారు. అయితే, ఈ సమాచారం ఆనంద్ మహీంద్రాకు చేరడంతో తనకు అండగా ఉంటానని గతంలో పేర్కొన్నారు. వెంటనే వంటగ్యాస్‌కు అయ్యే ఖర్చును భరించడంతో పాటు ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెడతానని కూడా మహేంద్రా పేర్కొన్నారు.

    తాజాగా మహీంద్రా మరోసారి ఆ బామ్మ వీడియో తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ.. కమలాత్తాళ్‌కు త్వరలోనే కొత్త ఇంటిని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ‘‘ఒకరి స్ఫూర్తిమంతమైన జీవితంలో చిన్న భాగమయ్యే అరుదైన అవకాశం చాలా కొద్దిమందికి మాత్రమే లభిస్తుంది. నాకు ఆ అవకాశాన్ని కల్పించిన ఇడ్లీ అమ్మ కమలాత్తాళ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలోనే ఆమెకు సొంత ఇల్లుతో పాటు పనిప్రదేశం కూడా రాబోతోంది’’ అని మహీంద్రా ట్వీట్‌ చేశారు.



    ఈ సందర్భంగా కమలాత్తాళ్‌ వ్యాపారంలో ఎలా పెట్టుబడి పెట్టాలో చెప్పిన మహీంద్రారైజ్‌ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘ప్రస్తుతం బామ్మకు కావాల్సింది కొత్త ఇంటి స్థలం.. ఆమె పేరున భూమిని రిజిస్టర్‌ చేసి మాకు సాయపడిన తాండమూత్తూర్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ధన్యవాదాలు’ అని మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. త్వరలోనే మహీంద్రా కంపెనీ బృందం ఆమె కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమలాత్తాళ్‌కు ఇప్పటికీ వంటగ్యాస్‌ అందిస్తోన్న భారత్‌గ్యాస్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.