Tag: Health Tips

  • Health Tips – బాదంపప్పు ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా..

    Health Tips – బాదంపప్పు ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా..

    బాదంపప్పు ఆరోగ్యానికి (Almond Health Benefits) ఎంతో మంచిది. బాదం పప్పు రోజు తీసుకోవడం వల్ల మనసు చురుగ్గా తయారవుతుందని మన పెద్దలు చెబుతున్నారు.

    బాదం పప్పు తింటే శరీరానికి బలం వస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది పెద్దలు పిల్లలు బాదంను ఇష్టంగా తింటారు. రేటు ఎక్కువగా అయినప్పటికీ.. కాస్త తక్కువ మొత్తంలోనైనా వంటలో వేసుకుంటారు. కూరల్లో వేయడంతో పాటు స్వీట్లు కూడా చేసుకుంటారు. కొంతమంది అయితే నేరుగా తినేస్తారు. బాదంపప్పును క్రమం తప్పకుండా రోజు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు మేలుచేస్తుంది. ఐతే చాలా మంది నానబెట్టిన బాదం తినేందుకు ఇష్టపడతారు. రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే వాటిని తీసుకుంటారు. ఐతే ఉదయం ఖాళీ కడుపు తోనే నానబెట్టిన బాదం తింటే లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.




    బాదంపప్పు తో ఆరోగ్య ప్రయోజనాలు:

    బాదంపప్పులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.ఇది పొడి చర్మం సమస్యను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో బాదంపప్పు తినడం వల్ల మీ ముఖంలో గ్లో పెరుగుతుంది. అందంగా తయారవుతారు.

    జీర్ణవ్యవస్థను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడాని కి ఖాళీ కడుపుతో బాదంపప్పును తినవచ్చు. బాదంపప్పును తీసుకోవడం ద్వారా ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా కదలిక శుభ్రపడుతుంది.

    బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో శక్తి మరియు బలం పెరుగుతుంది.బాదంపప్పును శక్తి వనరులు గా కూడా పిలుస్తారు. ఇందులో ఉండే పోషకాలు నీరసాన్ని, అలసటను దూరం చేస్తుంది.

    శరీరంలో శక్తి కోసం రోజు క్రమం తప్పకుండా నానబెట్టిన ఐదు బాదంపప్పులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో రోజు తినాలి. బాదంపప్పును నానబెట్టకుండా కూడా తినవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంచుతుంది.




    ఖాళీ కడుపుతో బాదంపప్పు ను తినడం వల్ల కలిగే నష్టాలు:

    బాదం పప్పును ఖాళీ కడుపుతో రోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. అదే విధంగా కొన్ని నష్టాలు కూడా ఉంటాయి.

    ఖాళీ కడుపుతో బాదంపప్పును రోజు తీసుకోవడం వల్ల ఫుడ్ అలర్జీ వస్తుంది. ఇది ఎవరికీ అర్థం కాదు. దాని వల్లే ఇలా జరుగుతోందని? అని కన్‌ప్యూజ్ అవుతుంది. కానీ నానబెట్టిన బాదం తింటే ఫుడ్ ఎలర్జీ వస్తుంటుంది. దీని వల్ల వికారం వంటి సమస్య రావచ్చును.

    గర్భిణీ స్త్రీలు ఖాళీ కడుపుతో బాదంపప్పు ను తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం.

    బాదంపప్పును ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల బాదంలో ఉండే పీచు పదార్థాలు కారణంగా శరీరంలో గ్యాస్ సమస్యలు వస్తాయన్నారు.

  • Skin Care Tips – మీరు అందంగా యవ్వనంగా మెరిసిపోతూ కనిపించాలంటే ఉదయం 9లోపు ఈ 4 పనులు చేయండి

    Skin Care Tips – మీరు అందంగా యవ్వనంగా మెరిసిపోతూ కనిపించాలంటే ఉదయం 9లోపు ఈ 4 పనులు చేయండి

    మీ ముఖం తాజాగా ఉంటే మీ రోజు ఖచ్చితంగా బాగుంటుంది. శక్తివంతమైన. అయితే అందరి సమస్య ఏమిటంటే సమయం తక్కువగా ఉండటం. పని ఎక్కువ. సారూప్య పరిస్థితిలో మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మరియు దానిని ఎలా చూసుకోవాలి? కాబట్టి మేము మీకు కొన్ని సాధారణ చిట్కాలను చెప్పబోతున్నాము. వీటిని అనుసరించడం ద్వారా మీరు నిజంగా అనేక పదార్థాలతో ముఖ్యమైన సమయాన్ని వెచ్చించకుండా మీ ముఖంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవచ్చు. దీని కోసం మీరు ఉదయాన్నే నిద్రలేచి 8 గంటలలోపు ఈ వస్తువులను చేయండి. చాలా రోజుల్లో మీ ముఖం మెరిసిపోవడాన్ని మీరు చూస్తారు.

    చర్మాని కాంతి వంతంగా తీసుకురావడానికి నిజంగా సులభమైన చిట్కాలు

     మీ ముఖం కడుక్కోండి.

    మీ ముఖం కాంతివంతంగా ఉండటానికి. క్యాండిసెంట్, మీ ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి ఫేస్ మార్ష్‌తో మీ ముఖాన్ని కడగడం ద్వారా రోజును ప్రారంభించండి. ఫేస్ మార్ష్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, అది మీ చర్మానికి సరిపోతుందని ఫ్లాష్ బ్యాక్ చేయండి. అయితే, వీలైతే జెల్ లేదా హెడ్ ప్రిడికేటెడ్ ఫేస్ మార్ష్‌ని ఉపయోగించండి. మీ ముఖాన్ని సరిగ్గా కడగడం వల్ల మీ ముఖం చాలా తాజాగా కనిపిస్తుంది.




     రోజ్ వాటర్ తో చర్మకాంతి.

    రోజ్ వాటర్ ఒక గ్రేట్ స్కిన్ రెమెడీ, దీనిని ఉపయోగించి మీరు మీ చర్మానికి ప్రకాశాన్ని తీసుకురావచ్చు. కాబట్టి మీ ముఖం కడిగిన తర్వాత, మీ చర్మం లేదా కాటన్ బాల్‌పై రోజ్ వాటర్ అప్లై చేసి బాగా అప్లై చేయండి.

     ఫేస్ ప్యాక్.

      ఇప్పటికీ, మీరు ఎక్కడికైనా వెళ్తున్నట్లయితే, మీ ముఖాన్ని కప్పుకోండి. మీతో ఏదైనా గుడ్డ లేదా దుపట్టాను తీసుకెళ్లండి. ఇది అవాంఛిత ధూళి పదార్థాల నుండి మీ ముఖాన్ని కవర్ చేస్తుంది.

    మాయిశ్చరైజర్.

     క్లీనర్‌ని ఉపయోగించడం వల్ల మీ చర్మం పొడిబారుతుంది. దీనికి సహాయపడటానికి, మాయిశ్చరైజర్ ఉపయోగించండి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, కాంతివంతంగా మారుతుంది. నిజానికి మాయిశ్చరైజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు, దానిని మీ చర్మంతో సరిపోల్చడానికి ఫ్లాష్ బ్యాక్ చేయండి.

  • కొబ్బరి నీళ్లతో కురులు సురక్షితం..

    కొబ్బరి నీళ్లతో కురులు సురక్షితం..

     ఇప్పుడు ఉన్న కాలుష్యం ఇతర కారణాల వల్ల మహిళలకు, పురుషులకు జుట్టు విపరీతంగా ఊడిపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మీకోసం..ఒకసారి ట్రై చేయండి.

    * కొబ్బరినీళ్ళతో స్కాల్ప్‌ను సర్క్యులర్ మోషన్‌లో మర్దన చేయాలి. అలా 10 నిమిషాల వరకు చేయాలి. తరువాత జుట్టు మొదళ్ళ నుంచి చివర వరకు కూడా కొబ్బరినీళ్ళతో మసాజ్ చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో తలస్నానం చేయాలి.

    * ముందుగా జుట్టును షాంపూతో కడగాలి. ఆపిల్ సిడర్ వెనిగార్, కొబ్బరినీళ్ళను ఒక మిశ్రమంలా తయారుచేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని శిరోజాలకు ఐప్లె చేయాలి. 10 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.



    * కొబ్బరినీళ్ళు, నిమ్మరసంను బాగా కలపాలి. ఈ విశ్రమాన్ని స్కాల్ప్‌పై 5 నిమిషాల పాటు మర్ధన చేయాలి. అలాగే మొత్తం జుట్టుకు పట్టించాలి. 15 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి.

    * కొబ్బరినీళ్ళు, తేనె ఈ రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు స్కాల్ప్‌పై మర్దన చేయాలి. అలాగే మొత్తం జుట్టుకు పట్టించి 20 నిమిషాల తరువాత నీటితో తలస్నానం చేయాలి.

  • గులాబీ పువ్వుల టీ తాగితే ఎన్నో లాభాలు..

    గులాబీ పువ్వుల టీ తాగితే ఎన్నో లాభాలు..

    గులాబీ పువ్వుల గురించి ఎవరికీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. వాటి అందానికి, సువాసనకు దాసోహం కానివారు ఎవరూ ఉండరు. అయితే కేవలం అందుకు మాత్ర‌మే కాకుండా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందివ్వడంలోనూ గులాబీ పువ్వులు బాగా పనిచేస్తాయి.

    గులాబీ పువ్వుల టీ తయారు చేసే విధానం…

    ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకుని అందులో కొన్ని గులాబీ పువ్వు రెక్కలను వేయాలి. అనంతరం ఆ నీటిని బాగా మరిగించాలి. దీంతో ఆ నీటిలోకి గులాబీ పువ్వు రెక్కల్లో ఉండే ఔషధ పదార్థాలు చేరుతాయి. 20 నిమిషాలపాటు సిమ్మర్‌లో ఉంచి మరిగించాక తయారయ్యే ద్రవంలో కొంత తేనె, నిమ్మరసం వంటివి కలుపుకోవాలి. దీంతో గులాబీ పువ్వుల టీ తయారవుతుంది.



    1. గులాబీ పువ్వుల టీని రోజూ తాగడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. చర్మంపై ఉండే మచ్చలు మొటిమలు పోతాయి. చర్మంలో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. చ‌ర్మం శుభ్రంగా మారుతుంది.

    2. గులాబీ పువ్వు రెక్కల్లో సహజసిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. నొప్పులు, వాపులు తగ్గుతాయి.

    3. మహిళలు గులాబీ పువ్వుల టీని తాగితే నెలసరి సరిగ్గా వస్తుంది. ఆ సమయంలో కలిగే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

    4. గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. మలబద్దకం, డయేరియా తగ్గుతాయి. మూత్రాశయ సమస్యలు పోతాయి. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.

    5. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. గులాబీ పువ్వుల టీని రోజూ తాగితే అధిక బరువు తగ్గుతారు.

  • అమ్మాయిలే బలవంతులు

    అమ్మాయిలే బలవంతులు

    మనిషి అన్నాక కొన్ని వీక్‌నెస్‌లు ఉండడం మామూలే! అయితే అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలకు అవి ఎక్కువ ఉంటాయని ఒక అధ్యయనంలో తేలింది. నవ్వు తెప్పించినా ఇవి నిజాలే!
    * 70 శాతం అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.
    * ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెబుతారు.




    * మగవారి మెదడు ఏకకాలంలో.. కుడి, ఎడమలలో ఏదో ఒకవైపే పనిచేస్తుంది. ఆడవాళ్లు మాత్రం రెండు పనులనూ ఒకేసారి చేయగలరు. అందుకే వారిని మల్టీ టాస్కింగ్ అని పిలుస్తారు.
    * ఆడవాళ్లలో కంటే మగవాళ్లలో రెండు రెట్లు ఎక్కువ చెమట పడుతుంది.
    * భార్య లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో నడిచేటప్పుడు మగవారు తమ నడకస్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు.
    * గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ పొడవున్నట్లు కనిపిస్తారు. అంతేకాదు.. వీల్లు జుట్టు ఉన్నవారికంటే 13 శాతం శక్తిమంతులట.
  • జొన్న ఇడ్లితో లాభాలెన్నో..!

    జొన్న ఇడ్లితో లాభాలెన్నో..!

     రోజూ ఉదయం అల్పాహారం తీసు కోవడం ప్రతి ఒక్కరూ చేసే పనే. పాత కాలపు వారు ఉదయం జొన్నరొట్టె, సంకటి తి నేవారు. కాలక్రమేణా పలు రకాలుగా అల్పాహారం తీసు కోవడం అలవాటు చేసుకు న్నారు. అయితే ప్రస్తుతం తీసుకునే వాటిలో పోషకాలు కరువై అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే రెగ్యులర్‌గా ఇడ్లి తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇడ్లిలో గ్లూటీన్‌ ఉండడంతో కొందరికి ఇష్టం ఉండదు. అందుకే గ్లూటీన్‌ ఉండని జొన్నతో ఇడ్లి చేసుకొని తింటే బాగుంటుందని జిల్లా కేంద్రానికి చెందిన న్యూట్రిషియన్‌ శాంతకుమారి సూచిస్తున్నారు.

    జొన్న ఇడ్లితో లాభాలెన్నో..!

    దీంట్లో అనేక పోషకాలు ఉంటాయని, ఆరోగ్యం కూడా కాపాడు కోవచ్చని అంటున్నారు. జొన్న ఇడ్లి తయారీ ఎలాగో ఆమె మాటల్లోనే..!

    * తయారీ విధానం..
    జొన్న ఇడ్లి తయారీకి ముందుకు ఒక కప్పు మినప పప్పు, రెండు కప్పుల జొన్నల రవ్వ తీసుకోవాలి. ముందురో జు రాత్రికి 4గంటల ముందు మినప పప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. జొన్నలను రవ్వ మాదిరి దంచుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ రెండు మిశ్ర మాలను రాత్రికే నానబెట్టాలి. ఉదయం మామూలు ఇడ్లి మాదిరిగానే వేసుకుంటే జొన్నఇడ్లి సిద్ధమవుతుంది.



    * ఉపయోగాలు..
    పైబర్‌, గ్లూటీన్‌ ఫ్రీ ఉండడం వల్ల ఎముకలకు బలం, కాళ్లకు ఎంతో ఉపయోగకరం. ప్రోటిన్స్‌, పీచు పదార్థం అధికంగా ఉండడంతో ప్యాట్‌ను తగ్గించుకో వచ్చు. ఐరన్‌, క్యాల్షియం, పాస్పరస్‌, మినరల్స్‌ పుష్క లంగా ఉంటాయి. ఎముకలు గుళ్లబా రకుండా పని చేస్తాయి. జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. గుండెను పదిలంగా ఉంచుతూ రక్తహీనత లేకుండా చూస్తుంది. ఒక కప్పు జొన్నలో క్యాలరీస్‌-651, కార్బోహైడ్రేట్స్‌- 143 గ్రా., ప్రొటీన్స్‌-21.7గ్రా., ఫైబర్‌-12గ్రా., ఫ్యాట్‌ – 6.3గ్రా., మెగ్నీషియం – 316.8 మి.గ్రా., పాస్పరస్‌ – 551 మి.గ్రా., క్యా ల్షియం – 53.8 మి.గ్రా., ఐరన్‌ – 8.4 మిల్లీ గ్రా ములు ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్‌ రాకుండా అడ్డుకుంటాయి. జొన్న ఇడ్లి రుచిగా ఉంటుంది. ప్రకృతి జీవన విధానానికి ఇది ఎంతో తోడ్పడుతుంది.

  • రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..?

    రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..?

     మన శరీరానికి శక్తినందించే దుంపల్లో బీట్‌రూట్ కూడా ఒకటి. దీన్ని చాలా మంది కూర చేసుకుని తింటారు. కొందరు జ్యూస్ తాగుతారు. అయితే రోజూ కూరలా చేసుకుని తినలేరు కాబట్టి జ్యూస్ చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగితే మంచిది. దీంతో మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

    1. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగితే శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో బరువు తగ్గుతారు.

    2. ఎప్పుడూ బద్దకంగా ఉండే వారు బీట్‌రూట్ జ్యూస్ తాగితే యాక్టివ్ అవుతారు. దీంతో ఉత్సాహంగా పనిచేయవచ్చు. ఈ జ్యూస్ మనలో చురుకుదనాన్ని పెంచుతుంది. ఎక్కువ సేపు యాక్టివ్‌గా ఉంటారు. అంత త్వరగా అలసిపోరు.

    3. గర్భిణీలు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే ఎంతో మంచిది. దీంతో వారికి కావల్సిన ఫోలిక్ యాసిడ్ అందుతుంది. తద్వారా అది కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది. శిశువు సక్రమంగా ఎదుగుతుంది. ఆరోగ్యంగా పుడుతుంది.

    4. ఎదిగే పిల్లలకు రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్‌ను తాగించాలి. దీంతో వారికి సంపూర్ణ పోషణ అందుతుంది. బీట్ రూట్‌ లో ఉండే విటమిన్ ఎ, సి, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, ఐరన్ పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుంది. వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చదువుల్లో రాణిస్తారు.



    5. బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగితే గుండె సమస్యలు రావు. రక్త సరఫరా మెరుగు పడుతుంది. ముఖ్యంగా హై బీపీ తగ్గుతుంది.

    6. రక్తహీనత సమస్యతో బాధపడేవారు రోజూ బీట్‌రూట్ జ్యూస్ సేవిస్తే ఆ సమస్య పోతుంది. రక్తం పెరుగుతుంది.

    7. లివర్ శుభ్రమవుతుంది. చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. పెదవులు పగలవు. ఎముకలు దృఢంగా మారుతాయి.

    8. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. చురుగ్గా ఆలోచించగలుగుతారు.

  • తానికాయతో అనారోగ్య సమస్యలకు చెక్

    తానికాయతో అనారోగ్య సమస్యలకు చెక్

    ఆయుర్వేద ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫాలనే త్రిదోషాల వల్ల అనారోగ్యాలు సంభవిస్తాయని అందరికీ తెలిసిందే. ఈ మూడు దోషాల్లో ఏర్పడే అసమతుల్యతల కారణంగానే మనకు రోగాలు వస్తుంటాయి. అయితే కఫ దోషం వల్ల కలిగే అనారోగ్యాలకు మాత్రం తానికాయలు బాగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ, శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థలలో ఏర్పడే అనారోగ్య సమస్యలను తానికాయలు నయం చేస్తాయి. తానికాయల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

    1. తానికాయ చూర్ణం, చక్కెర వేసుకొని ఒక టీస్పూన్ మోతాదులో వేసుకొని రెండింటినీ బాగా గ్లాస్ లో కలపాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని తినాలి. రోజూ ఇలాగే చేస్తే కంటి చూపు బాగా కనిపిస్తుంది.

    2. తానికాయ చూర్ణం ఒక టీస్పూన్ తీసుకుని దానికి కాస్త తేనె కలిపి తింటే గొంతులో నొప్పి, మంట తాగుతుంది. గొంతు బొంగురు పోవడం తగ్గుతుంది. కంఠస్వరం తిరిగి వస్తుంది.

    3. తానికాయ గింజల పప్పును రాత్రి పూట తింటే నిద్ర చక్కగా పడుతుంది.

    4. తానికాయల చూర్ణం 10 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి రెట్టింపు మోతాదులో తేనె కలిపి సేవించాలి. దీంతో ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.

    5. శరీరం మంటగా ఉంటే తానికాయ గింజల పప్పును నూరి శరీరానికి రాసుకోవాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.



    6. తానికాయల చూర్ణం 3 గ్రాములు, 7 గ్రాముల పాత బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

    7. తానికాయ చూర్ణం, అశ్వగంధ చూర్ణం, పాత బెల్లం సమాన మోతాదుల్లో తీసుకుని రోజూ సేవిస్తుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వాతం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి.